Tejashwi Yadav : బిహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. ఆర్జేడీ వ్యవస్ధాపక దినం సందర్భంగా శుక్రవారం తేజస్వి మీడియాతో మాట్లాడారు. పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
బిహార్లో విచ్చలవిడిగా నేరాలు పెచ్చుమీరాయని అన్నారు. పేపర్ లీక్ ఘటనలూ వెలుగుచూశాయని తేజస్వి యాదవ్ చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ ఈ విషయాలపై మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ అంశాల గురించి మాట్లాడితే తేజస్వినే ఇదంతా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత 17 ఏండ్లుగా గ్రామీణాభివృద్ధి శాఖ జేడీయూతోనే ఉందని, ఇప్పుడు కూలిన బ్రిడ్జిలను ఎవరు మంజూరు చేశారు, ఎవరు శంకుస్ధాపన చేశారనే వివరాలను వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ వివరాలు వెల్లడిస్తే ఎవరు అవినీతిపరులనేది తేటతెల్లమవుతుందని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకమే అని ఆయన మండిపడ్డారు.
Read More :