Suresh Gopi : కేరళలో బీజేపీకి తొలిసారి ఒక లోక్సభ స్థానం దక్కింది. త్రిసూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మలయాళ నటుడు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు ఆయన విజయం ఖాయమైంది. ప్రస్తుతం సురేశ్ గోపి 4,09,239 ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
ఆ తర్వాత సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్ 3,34,160 ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీధరన్ 3,24,431 ఓట్ల మెజారిటీతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సునీల్ కుమార్పై సురేశ్ గోపి 75,079 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో గెలుపు ఖాయమైపోయింది.
దాంతో సురేశ్ గోపి అప్పుడే సంబరాల్లో మునిగితేలుతున్నారు. స్థానిక బీజేపీ శ్రేణులు, అభిమానులతో కలిసి ఆయన సంబురాలు చేసుకుంటున్నారు. డప్పుచప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సురేశ్ గోపి సంబురాలు చేసుకుంటున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
BJP gets first ever Lok Sabha MP from Kerala, Suresh Gopi leads by 70k votes in Thrissur..
Rajeev Chandrasekhar also leads in Thiruvananthapuram against incumbent & 3-time MP Shashi Tharoor pic.twitter.com/UxlN8eDynr
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 4, 2024