Supriya Shrinate : మహిళలపై వేధింపులు, నేరాలు జరిగినప్పుడు బీజేపీ మహిళా నేతలు ఎందుకు ముఖం చాటేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే ప్రశ్నించారు. హథ్రాస్, లఖింపూర్ ఎక్కడ మహిళలపై నీచమైన నేరాలు జరిగినా అలాంటి ప్రతి సందర్భంలోనూ బీజేపీ మహిళా నేతలు కనిపించరని విమర్శించారు.
మహిళల కోసం వారు ఎందుకు వెన్నుదన్నుగా నిలబడతామని భరోసా ఇవ్వరని ఆమె నిలదీశారు. దేశ ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసని సుప్రియా పేర్కొన్నారు. ప్రభుత్వం నేరగాళ్లపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోయినా ప్రజలు న్యాయం చేస్తారని, పాలకులకు దీటైన జవాబు ఇస్తారని అన్నారు.
అజయ్ మిశ్రా తేని వంటి వారిని ప్రజలు ఓడించి రైతులకు న్యాయం చేశారని, స్మృతి ఇరానీని ఓడించి ఆమె అహంకారానికి గుణపాఠం చెప్పారని సుప్రియా శ్రీనటే పేర్కొన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి అవకాశం వచ్చినప్పుడు ప్రజలే దీటుగా బదులిస్తారని అన్నారు.
Read More :
Gigantic Jets: హిమాలయాలపై భారీ మెరుపులు.. ఆ అద్భుత పిక్స్ షేర్ చేసిన నాసా