న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయి. ఆ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతున్నది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరీ చేయాలని సోరెన్ కోరారు. దీని కోసం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసును ఉదాహరణగా చూపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.