Sunita Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ను జైల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్ధలన్నింటినీ ప్రయోగిస్తోందని ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆమె ఆరోపించారు.
కేజ్రీవాల్కు జూన్ 20న బెయిల్ లభించగా, వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుంది..ఆ మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది ఇవాళ ఆయనను అరెస్ట్ చేశారని సునీతా కేజ్రీవాల్ వివరించారు. కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రాకుండా వ్యవస్ధలన్నింటినీ కేంద్రం ప్రయోగిస్తోందని ఆమె మండిపడ్డారు.
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం కేజ్రీవాల్ను కోర్టు రూం నుంచే అరెస్ట్ చేసింది. కోర్టు రూంలో కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ కోర్టు వెకేషన్ జడ్జి సీబీఐని అనుమతించారు. మరోవైపు ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అయిన సందర్భంగా ఎన్డీయే సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టారు.
ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లా ఎమర్జెన్సీని ఖండించారు. అప్పట్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాల పాటు సభలో మౌనం పాటించారు.
Read More :