Students Cheating : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత లెక్చరర్లది. లెక్చరర్లు చెప్పింది విని, శ్రద్ధగా చదువుకుని జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులది. కానీ మధ్యప్రదేశ్లోని మొరెనాలో బీఏ, బీఎస్సీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, రాయిస్తున్న లెక్చరర్లు ఇద్దరూ తమ బాధ్యతలు మరిచారు. లెక్చరర్లు విద్యార్థులకు గైడ్లు ఇచ్చి మరీ పరీక్షలు రాయిస్తూ పట్టుబడ్డారు.
మొరెనాలోని కేఎస్ హయ్యర్ సెకండరీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పరీక్ష కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన తహసీల్దార్.. విద్యార్థులు గైడ్లు పెట్టి పరీక్షలు రాస్తుండటం, లెక్చరర్లు దగ్గరుండి మరీ రాయిస్తుండటం చూసి షాకయ్యారు. కాపీయింగ్ను వీడియో తీయించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని జీవాజీ యూనివర్సిటీకి సంబంధించిన బీఏ, బీఎస్సీ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. మొరెనాలోని కేఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో కూడా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి తహసీల్దార్ జ్యోతి లక్షాకర్ తనిఖీకి వెళ్లేసరికి యథేచ్ఛగా కాపీయింగ్ జరుగుతోంది. కాగా, ఈ కాపీయింగ్ ఘటనపై విచారణ జరిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | #Morena: Students Caught Cheating In B.A., https://t.co/0GUaMJU8Gh. Exams Conducted By Jiwaji University#MadhyaPradesh #MPnews #education pic.twitter.com/dj9PxYNbde
— Free Press Madhya Pradesh (@FreePressMP) June 29, 2024