న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, స్పీకర్ ఓం బిర్లా మధ్య లోక్సభ(Loksabha)లో వాగ్వాదం జరిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోదీ ముందు స్పీకర్ ఓం బిర్లా తలవంచి నమస్కరించినట్లు రాహుల్ ఆరోపించారు. దానికి స్పీకర్ ఓం బిర్లా బదులు ఇస్తూ పెద్దలను గౌరవించే సంస్కృతిని తాను పాటిస్తున్నట్లు తెలిపారు. 18వ లోక్సభకు స్పీకర్ను ఎన్నుకున్న సమయంలో.. ప్రధాని మోదీతో కలిసి తాను కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లానని, షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో తాను ఓ విషయాన్ని గమించినట్లు రాహుల్ తెలిపారు. తాను చేయి ఇచ్చి షేక్ హ్యాండ్ చెప్పినట్లు మీరు నిటారుగా నిలబడ్డారని, కానీ ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు ఆయన ముందు తలవంచారని రాహుల్ ఆరోపించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఓం బిర్లా స్పందించారు.
పెద్దలను గౌరవించాలన్న సంప్రదాయాన్ని తాను పాటిస్తున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. సభానేత అని, సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారంతో పాటు వ్యక్తిగతంగా..పెద్దలను గౌరవించడం తన ఉద్దేశం అని, సమ ఉజ్జీలను సమానంగా చూస్తానని, అదే తాను నేర్చుకున్నట్లు బిర్లా తెలిపారు. చైర్లో ఉండి కూడా ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని, పెద్దల ముందు తలవంచడం తన సంస్కృతి అని, అవసరం అయితే వారి పాదాలను తాకనున్నట్లు కూడా బిర్లా వెల్లడించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ సభలో స్పీకర్ కన్నా ఎవరూ పెద్ద కాదు అని, ఆయన ముందు అందరూ తల వంచాలన్నారు. నేను మీ ముందు తలవంచుతానని, యావత్ ప్రతిపక్షం కూడా అలాగే చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. స్పీకరే కస్టోడియన్ అని, ఆయన మాటే లోక్సభలో తుది అంశమన్నారు. లోకసభ సభ్యులుగా తాము స్పీకర్ సేవలో ఉన్నట్లు రాహుల్ తెలిపారు. మీరు ఏం చెప్పినా వింటామని, కానీ సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాహుల్ కోరారు.
తొలుత రాహుల్ తన ప్రసంగంలో మాట్లాడుతూ శివుడి ఫోటోను చూపించారు. అయితే రూల్స్ ప్రకారం ఫోటోలను చూపించడం కుదరదు అని స్పీకర్ పేర్కొన్నారు.
“When I shook your hand, you stood straight and when Modi ji shook your hand, You bowed down”. – Rahul Gandhi to Speaker OM Birla. pic.twitter.com/2bhBmvwtzE
— Mohammed Zubair (@zoo_bear) July 1, 2024