ఆధునిక టెక్నాలజీతో లాజిస్టిక్స్ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక డ్రోన్ల ద్వారా సంప్రదాయ లాజిస్టిక్స్, రవాణా రంగంలో సమూల మార్పులే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్కైఎయిర్ సీఈవో అంకిత్ కుమార్ తెలిపారు.
వేగం, సామర్ధ్యం, నిలకడతో కూడిన సేవల ద్వారా లాజిస్టిక్స్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని చెప్పారు. గురుగ్రాంలో అంకిత్ కుమార్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. డ్రోన్లతో లాజిస్టిక్స్ సేవలతో సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు పర్యావరణానికీ మేలు జరుగుతుందని అన్నారు.
పైలట్లు ఈ సాఫ్ట్వేర్ను వాడటం ద్వారా డ్రోన్ల సేవలు కస్టమర్లకు అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్ధితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవహరించేందుకు సెన్సర్లను ఉపయోగిస్తామని తెలిపారు. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్ వంటి రాష్ట్రాల్లో మంచు, ప్రతికూల ఉష్ణోగ్రతలు, గాలుల వంటి సవాళ్లు ఎదురవుతాయని పేర్కొన్నారు.
Read More :