ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించారు.
తమ పార్టీని బలహీనపరచాలనుకునే వారిని తిరిగి చేర్చుకోబోమని, పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడేవారిని మాత్రమే చేర్చుకుంటామని శరద్ పవార్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో అజిత్ వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్తో కలిసి నడవాలనే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.