Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ (Hathras)లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రతీభాన్పూర్లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
యూపీలో తొక్కిసలాట.. 27 మంది మృతి
యూపీలోని హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఇప్పటికే 27 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం… pic.twitter.com/5pTNGmxEls
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024
Also Read..
NEET-PG | ఈనెలలోనే నీట్-పీజీ ఎగ్జామ్.. పరీక్షకు రెండు గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ
Hyatt Regency | ఫైవ్ స్టార్ హోటల్లో కూలిన షెడ్డు.. దంపతుల తలకు గాయాలు
Rahul Gandhi | లోక్సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు