Kerala | తిరువనంతపురం, ఆగస్టు 22: కేరళ అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బాధ్యతలను భర్త నుంచి భార్య అందుకోబోతున్నారు. ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎస్ డాక్టర్ వీ వేణు ఆగస్టు 31న రిటైర్ కాబోతున్నారు.
ఆయన పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్గా ఆయన భార్య శారద మురళీధరన్ను ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎంపిక చేయటం వార్తల్లో నిలిచింది. ఐఏఎస్ దంపతులు వరుసగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమితులు కావటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వేణు, శారద ఇద్దరూ 1990 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు.