MP Avadhesh Prasad | న్యూఢిల్లీ: లోక్సభ ఉప సభాపతి ఎన్నికలు జరిగితే, ఇండియా కూటమి అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ను బరిలో నిలపాలని ఇండియా కూటమి యోచిస్తున్నది. ఆయన ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం పరిధిలోనే అయోధ్య ఉంది. 2019-24లో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది.
సంప్రదాయం ప్రకారం ఈ పదవిని ప్రతిపక్షాలకు కేటాయిస్తారు. అయితే దీనికి బీజేపీ ఇష్టపడటం లేదు. ఎన్డీయే కూటమి పక్షాలకే ఈ పదవిని ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ గాంధీ (కాంగ్రెస్), అఖిలేశ్ యాదవ్ (సమాజ్వాదీ పార్టీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) ఇప్పటికే దీనిపై చర్చించగా మమత బెనర్జీ సైతం ఓకే అన్నట్టు తెలిసింది.