Road Accident | కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్లోని కరౌలీలో చోటు చేసుకున్నది. కరౌలీ-మందరాయల్ రహదారిపై దుండాపూరా మలుపునకు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అతివేగంగా వెళ్తున్న కారు, ట్రక్కు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.
రెండు వాహనాలు భారీ శబ్దంతో ఢీకొట్టుకోవడం విని స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులతో పాటు అంబులెన్స్కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరౌలీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరిశీలించిన వైద్యులు అప్పటికే తొమ్మిది మంది మరణించినట్లు ధ్రువీకరించారు. గాయపడ్డ నలుగురికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కలెక్టర్ నీలభ్ సక్సేనా, ఎస్పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.