న్యూఢిల్లీ: హిమాలయాలపై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్(Gigantic Jets)గా పిలిచే ఆ మెరుపుల్ని .. నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో భారీ మెరుపులు మెరిశాయి. ఆ చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. నాలుగు భారీ మెరుపులు కొన్ని సెకన్ల వ్యవధిలోనే హిమాలయాలపై పడ్డాయి. భూమి, ఐయనోస్పియర్ మధ్య ఈ మెరుపులు సాధారణంగా కనిపిస్తుంటాయి. సాధారణ మెరుపుల కన్నా.. గార్గాంటువన్ గైజాంటిక్ జెట్స్ మెరుపులు 50 శాతం అధికంగా శక్తివంతంగా ఉంటాయి. భూమి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆ మెరుపు ప్రయాణించగలదు. గత ఏడాది ఆగస్టులో ప్యూర్టో రికో ఫోటోగ్రాఫర్ కూడా ఇలాంటి జెట్స్ చిక్కాయి. హురికేన్ ఫ్రాంక్లిన్ ను ఫోటోలు తీస్తున్న సమయంలో భారీ మెరుపులు అతనికి కెమెరాకు చిక్కాయి. 2018లో ఈ మెరుపులు ఒడిశాలోని భద్రక్లో కూడా కనిపించాయి.