Rajya Sabha | రాజ్యసభ (Rajya Sabha) ఇవాళ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్కర్.. ఎంపీ హర్భజన్ సింగ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇటీవలే మృతి చెందిన మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. అలాగే నిన్న ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో బోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటనలో మృతిచెందిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సంతాపంగా రాజ్యసభ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం సభా కార్యక్రమాలను చైర్మన్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానంపై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగించనున్నారు.
#WATCH | Delhi: Rajya Sabha observes silence to mourn the loss of lives in Hathras Stampede accident. pic.twitter.com/mcF3aBszUo
— ANI (@ANI) July 3, 2024
మరోవైలపు మంగళవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభలో విపక్షాల ఆందోళనలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఆయన ప్రసంగానికి సిద్ధమవగానే ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్.. మణిపూర్’, ‘తానాషాహి నహీ చలేగీ(నియంతృత్వం చెల్లదు)’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ నిలువరించేందుకు ప్రయత్నించినా ఇండియా కూటమి సభ్యులు నిరసనను కొనసాగించారు. ఒకానొక దశలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై స్పీకర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ సమాధానం ఇచ్చిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు.
Also Read..
Vijay Thalapathy | నీట్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం : హీరో విజయ్
T20 World Cup | వరల్డ్ కప్ వస్తోంది.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
Mumbai College | టీషర్ట్స్, చిరిగిన జీన్స్తో రావొద్దు.. విద్యార్థులకు ముంబై కళాశాల కీలక ఆదేశాలు