Railway | మహిళకు రూ.లక్ష పరిహారం అందించాలని రైల్వేశాఖకు చెందిన జనరల్ మేనేజర్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రైల్వే సేవల్లో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. ఈ క్రమంలో ఆమె వస్తువుల చోరీకి గురయ్యాయని కమిషన్ పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా ప్రయాణికురాలు ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ 2016 నాటికి చెందిన కేసులో పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఓ మహిళా ప్రయాణికురాలు ఝాన్సీ-గ్వాలియర్ మధ్య మాల్వా ఎక్స్ప్రెస్లో రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ప్రయాణించింది.
ఈ సమయంలో రిజర్వేషన్ లేకుండా కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. సదరు మహిళకు చెందిన బాగ్యులో నుంచి రూ.80వేల విలువైన వస్తువులను అపహరించారు. దీంతో సదరు మహిళా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణం అందించడమే రైల్వే విధి అని.. అదే సమయంలో ప్రయాణికుల లగేజీ బాధ్యత కూడా రైల్వేపైనే ఉందని ఆ మహిళ ఫిర్యాదుల పేర్కొన్నది. మహిళ దాఖలు చేసిన ఫిర్యాదును కమిషన్ చైర్మన్ ఇందర్జీత్ సింగ్, సభ్యురాలు రష్మీ బన్సాల్ విచారించారు. అయితే, ప్రయాణంలో లగేజీ విషయంలో అజాగ్రత్తగా.. లగేజీని బుక్ చేయలేదంటూ రైల్వేశాఖ చేసిన వాదనలను కమిషన్ తోసిపచ్చింది.
ఘటనపై ఫిర్యాదు చేసేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని బాధితులు తెలిపింది. దీనిపై కమిషన్ మాట్లాడుతూ ఘటన జరిగిన తీరు, మహిళ విలువైన వస్తువులు చోరీ, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఇబ్బందులుపడ్డారని తెలిపారు. రైల్వేతో పాటు సిబ్బంది విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకపోతే మహిళ వస్తువులు చోరీకి గురయ్యేవి కాదని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు బాధితురాలికి రూ.80వేలతో పాటు కేసు విచారణ సమయంలో జరిగిన ఇబ్బందులకు రూ.20వేలు, కేసు విచారణ ఖర్చుల నిమిత్తం రూ.8వేలు కలిపి మొత్తం రూ.రూ.1,08,000 చెల్లించాలని కమిషన్ రైల్వే జనరల్ మేనేజర్ను ఆదేశించింది.