NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లపై మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శలు గుప్పించారు. నీట్ విద్యార్ధులు పరీక్ష కోసం ఏండ్ల తరబడి సన్నద్ధమయ్యారని, వారి కుటుంబం విద్యార్ధులకు ఆర్ధికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిందని అన్నారు. నీట్ పరీక్ష ధనవంతులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారని, ప్రతిభ కల విద్యార్ధుల కోసం కాదని వారికి అర్ధమవడంతో పరీక్షపైనే విద్యార్ధులు విశ్వాసం కోల్పోయారని చెప్పారు.
తాను పలువురు నీట్ విద్యార్ధులను కలిశానని, సంపన్నులు సులభంగా పాస్ అయ్యేలా వారి కోసం కోటాను సృష్టించేలా పరీక్షను డిజైన్ చేశారని సదరు విద్యార్ధులు తనతో చెప్పారని పేర్కొన్నారు. నీట్ పరీక్షను పేద విద్యార్ధులకు ప్రయోజనకరంగా మలిచేలా డిజైన్ చేయలేదని విద్యార్ధులతో మాట్లాడిన సందర్భంగా వారు వాపోయారని గుర్తుచేసుకున్నారు.
ఇక అంతకుముందు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామని అన్నారు. ఇండియా కూటమి నేతలను ప్రభుత్వ ప్రోద్భలంతో ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను వేధిస్తూ వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు.
శివుడి ఫొటోను చూపుతూ తాను శివుడి నుంచి ప్రేరణ పొందానని అన్నారు. శివుడి ఫొటోను, రాజ్యాంగ ప్రతిని సభలో చూపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్రం ఆదేశాలతో తనను టార్గెట్ చేశారని దయ్యబట్టారు. నా సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎంపీ పదవినీ, ఇంటినీ లాక్కున్నారని అన్నారు. విపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఓ సినిమాతో మహాత్మా గాంధీ అంటే ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారని, ఆయన అజ్ఞానాన్ని అర్ధం చేసుకున్నారా అని ప్రశ్నించారు.
Read More :
New Criminal Code | నూతన చట్టాలతో విచారణ వేగవంతం, సత్వర న్యాయం : అమిత్ షా