న్యూఢిల్లీ, జూలై 2: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘నేను ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాను. నేను మాట్లాడింది సత్యం.
వారికి ఎంత కావాలో అంత తొలగించుకోవచ్చు కానీ సత్యమే గెలుస్తుంది.’ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సత్యాన్ని తొలగించవచ్చని, కానీ వాస్తవంలో మాత్రం తొలగించలేరని రాహుల్ పేర్కొన్నారు.