Hathras Stampede : యూపీలోని హథ్రాస్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఈ ఘటనపై పుతిన్ సంతాప సందేశం పంపారు.
మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలియచేయాలని కోరారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు. కాగా, యూపీలోని హాథ్రాస్లో జరిగిన భోలే బాబా(Bhole Baba) సత్సంగ్లో విషాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంత పెద్దసంఖ్యలో ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నా ఆస్ధాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తొక్కిసలాటలో దాదాపు 121 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన బాబా ఆచూకీ అంతుబట్టడం లేదు. ఇక మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు. ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఆ బాబా కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది.ఇక హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ దేశంలో ప్రజల ప్రాణాలకు విలువలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి ఏకంగా తన పేరిట బాబా బజార్ను నిర్మిస్తున్నా ఆయనపై ఎలాంటి నియంత్రణ లేదని అన్నారు. ఇది కేవలం హథ్రాస్లోనే కాదని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Team India | ఎట్టకేలకు బార్బడోస్ను వీడిన టీమ్ఇండియా.. ప్రత్యేక ఫ్లైట్లో భారత్కు పయనం