Rahul Gandhi | కేరళలోని వయనాడ్ లోక్సభ సభ్యత్వానికి (Wayanad Lok Sabha seat) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామాను లోక్సభ ప్రొటెం స్పీకర్ (Pro tem Speaker) భర్తృహరి మహతాబ్ ఆమోదించారు. ఇవాళ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన అనంతరం రాహుల్ రాజీనామాను ఆమోదించారు.
కాగా, ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తోపాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. రెండూ చోట్ల ఆయన గెలుపొందారు. అయితే, ఎన్నికైన 14 రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో నిబంధనను అనుసరించి వయనాడ్ను వదులుకున్నారు. ఇకపై ఆయన రాయ్బరేలి ఎంపీగా కొనసాగనున్నారు. దీంతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బలం 99కి తగ్గింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 99 సీట్లే వచ్చాయి. కానీ, మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ లోక్సభ ఎంపీల సంఖ్య 100కు చేరుకుంది. ఇప్పుడు రాహుల్ రాజీనామాతో మళ్లీ 99కి తగ్గింది.
Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.
Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb
— ANI (@ANI) June 24, 2024
Also Read..
Lok Sabha | లోక్సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ
PM Modi | మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తాం : ప్రధాని మోదీ