Priyanka Chaturvedi : ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలు గట్టి సందేశం పంపారని ప్రియాంక చతుర్వేది అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన తీరుపై, సునీతా కేజ్రీవాల్ ప్రకటనలపై ఆమె స్పందించారు.
ఎన్నికైన సీఎం, రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ పట్ల మోదీ సర్కార్ వ్యవహార శైలిని ప్రియాంక చతుర్వేది తప్పుపట్టారు. ఇది విచారణ కాదని, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న ఎమర్జెన్సీని ప్రతిబింబిస్తోందని ఆమె దుయ్యబట్టారు.
Read More :
BSNL | హ్యాకర్ల చేతిలో బీఎస్ఎన్ఎల్ డాటా.. డార్క్ వెబ్లో అమ్మకానికి!