న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ సుధామూర్తిపై ప్రధాని మోదీ(PM Modi ) ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. సుధామూర్తి తన ప్రసంగంలో స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి చర్చించినట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్యం గురించి సవివరంగా మాట్లాడిన సుధామూర్తికి థ్యాంక్స్ చెబుతున్నానని ఆయన అన్నారు. ఆ సమయంలో సుధామూర్తి లేచి నిలబడి ప్రధానికి నమస్కరించారు. తల్లుల గురించి కూడా సుధా మూర్తి భావోద్వేగంగా ప్రసంగించినట్లు మోదీ తెలిపారు. సుధామూర్తి తన ప్రసంగంలో మాట్లాడుతూ.. తల్లి చనిపోయినప్పుడు ఆస్పత్రిలో ఒకరి మరణంగా నమోదు చేస్తారని, కానీ ఓ కుటుంబానికి ఆ తల్లి ఎప్పటికీ దూరమైనట్లే అని పేర్కొన్నారు.
भारत ने नारा नहीं, बल्कि निष्ठा के साथ Women Led Development की ओर कदम बढ़ाए हैं: PM @narendramodi#ParliamentSession#PMModiInRajyaSabha#ParliamentSession2024 pic.twitter.com/rN1bcquKm3
— MyGovIndia (@mygovindia) July 3, 2024
సుధా చేసిన ఆ వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, శానిటేషన్పై గత పదేళ్లుగా ప్రియార్టీ ఇస్తోందన్నారు. తాము నిర్మించిన టాయిలెట్ల వల్ల దేశంలోని మహిళలు లబ్ధి పొందినట్లు ఆయన చెప్పారు. మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందించామని, గర్భిణి స్త్రీలకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాలని సుధామూర్తి తన ప్రసంగంలో ప్రస్తావించారు.