న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ లోక్సభలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ధన్యవాద తీర్మానంపై చర్చకు 16 గంటల సమయాన్ని కేటాయించారు. అయితే మంగళవారం సాయంత్రం డిబేట్ ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. శుక్రవారం నీట్ రద్దుపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపట్టడం వల్ల ఆ రోజు సభ జరగలేదు.
అయితే సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. హిందువులు అని చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసకు పాల్పడుతున్నట్లు రాహుల్ తన ప్రసంగాలు ఆరోపించారు. ఆ వ్యాఖ్యల పట్ల సభలో ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలకు మోదీ ఎలా కౌంటర్ ఇస్తారన్న ఆసక్తి నెలకొన్నది. దీంతో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.