న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో లింకున్న మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసేలా మద్దతు ఇవ్వాలని, ఆ తర్వాత ఆ అంశంలో క్రెడిట్ తీసుకోవాలని విపక్షాలను ప్రధాని మోదీ(PM Modi ) కోరారు. గడిచిన 40 ఏళ్ల నుంచి మహిళా రిజర్వేషన్ అంశం రాజకీయ అకాడాలో ఉండిపోయిందన్నారు. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 33 రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించాలంటే.. లోక్సభలో సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాల్సిన అవసరం ఉన్నది. మూడో వంతు మెజారిటీ ఆమోదిస్తేనే దిగువ సభలో ఆ బిల్లు పాసవుతుంది. అయితే 80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మోదీ.. రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపి, రాజకీయ పార్టీలు దానికి క్రెడిట్ తీసుకోవచ్చు అన్నారు.
జాతీయ పతాకం నీడలో నిలుచుని మాట్లాడుతున్నానని, అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నానని, మహిళలను గౌరవించాల్సిన సమయం వచ్చిందని, అసెంబ్లీలు.. లోక్సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి మహిళలను గౌరవించాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఏప్రిల్ 17వ తేదీన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఆ బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అయితే ఆ బిల్లు నెగ్గాలంటే 352 ఓవర్ల అవసరం ఉండే. కానీ ఆ బిల్లు వీగిపోవడంతో.. ప్రధాని మోదీ మరుసటి రోజు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విపక్షాల వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదన్నారు.
आदरणीय प्रधानमंत्री श्री @NarendraModi जी का लाल किले की प्राचीर से तिरंगे की छाया में सभी राजनीतिक दलों से विधानसभा और लोकसभा में 33% महिला आरक्षण से जुड़ने का आग्रह…#IndiaIndependenceDay pic.twitter.com/pbKFaxhlTc
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 15, 2026