PM Modi | ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి నేటికి (జూన్ 25) 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ హస్తం పార్టీ చేస్తోన్న ఆరోపణలకు ఈ సందర్భంగా మోదీ గట్టిగా బదులిచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చేసిందని విమర్శించారు. ఎమర్జెన్సీ విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై (Constitution) ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కింది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు.
ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించింది. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతిఅంశాన్ని ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉంది. రాజ్యాంగంపై వారికి ఉన్న అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారు. అయితే, వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు.
Today is a day to pay homage to all those great men and women who resisted the Emergency.
The #DarkDaysOfEmergency remind us of how the Congress Party subverted basic freedoms and trampled over the Constitution of India which every Indian respects greatly.
— Narendra Modi (@narendramodi) June 25, 2024
Just to cling on to power, the then Congress Government disregarded every democratic principle and made the nation into a jail. Any person who disagreed with the Congress was tortured and harassed. Socially regressive policies were unleashed to target the weakest sections.
— Narendra Modi (@narendramodi) June 25, 2024
Those who imposed the Emergency have no right to profess their love for our Constitution. These are the same people who have imposed Article 356 on innumerable occasions, got a Bill to destroy press freedom, destroyed federalism and violated every aspect of the Constitution.
— Narendra Modi (@narendramodi) June 25, 2024
Also Read..
Karnataka | కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చికెన్ కబాబ్లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్సైడ్ షాప్లో చాట్ తిని
Minister Atishi | క్షీణించిన ఆతిషి ఆరోగ్యం.. ఢిల్లీ మంత్రికి ఐసీయూలో చికిత్స