MP RK Choudhary | న్యూఢిల్లీ, జూన్ 27: లోక్సభలో స్పీకర్ ఆసనం పక్కన సెంగోల్ (రాజదండం)ను ఉంచడం వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యంలో రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించగా, భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నారని విపక్ష సభ్యులపై బీజేపీ మండిపడింది.
బంగారం పూతపూసిన ఐదు అడుగుల సెంగోల్ స్థానంలో రాజ్యాంగం ప్రతిని ఉంచాలని కోరుతూ సమాజ్వాది పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
కాగా, సమాజ్వాదీ పార్టీకి భారత చరిత్ర లేదా సంస్కృతి అంటే గౌరవం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.