న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో భయానక పరిస్థితులు ప్రయాణికుల్ని వెంటాడుతున్నాయి. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు బయల్దేరిన విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావటంతో ప్రయాణికులంతా సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. ఒక వ్యక్తి ఏకంగా ఓవర్హెడ్ లగేజ్ కంపార్ట్మెంట్ వద్ద ఇరుక్కుపోయాడు.
మిగతా ప్రయాణికులు అతడిని కిందికి దించుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటి ఈ ఘటనలో కనీసం 40మందికి పైగా గాయపడ్డారని మీడియా తాజాగా పేర్కొన్నది.