న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi Airport) ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున ఎయిర్పోర్టులోని ట్రెర్మినల్-1 పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒకరు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైకప్పు కూలినట్లు ఉదయం 5.30 గంటలకు తమకు సమాచారం అందిందన్నారు. పైకప్పు ట్యాక్సీలు సహా పలు వాహనాలపై పడటంతో ధ్వంసమయ్యాయని చెప్పారు. భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
టెర్మినల్-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా చెకిన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు. కాగా, పైకప్పు కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. టెర్మినల్-౧ వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు.
#UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N
— ANI (@ANI) June 28, 2024
Terminal 1 Incident pic.twitter.com/Dv9Sir5l4p
— Delhi Airport (@DelhiAirport) June 28, 2024
Personally monitoring the roof collapse incident at T1 Delhi Airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospital. Rescue operations are still ongoing.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 28, 2024