నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్న పత్రం లీకేజీ అంశం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో గల లోపాలను బయట పెడుతున్నట్లు కనిపిస్తున్నది. అంకిత భావంతో పని చేసే క్యాడర్, టెక్నికల్ నిపుణుల లేమి, పరీక్షల నిర్వహణకు అవసరమైన ఫూల్ ప్రూఫ్ స్టెప్ వైజ్ ఎస్వోపీల ఏర్పాటు తదితర అంశాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ దృష్టి సారించనున్నదని తెలుస్తున్నది. ఆన్ లైన్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, కోర్ కాంపిటీషన్, వాస్తవిక విజన్కు ఎన్టీఏ దూరమైందా? అన్న కోణంలోనూ ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ సీరియస్ గా పరిశీలించనున్నది.
కీలకమైన జేఈఈ-మెయిన్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏలో గణనీయ స్థాయిలో సిబ్బంది ఉండాలి. కానీ పూర్తిగా కన్సల్టెంట్లు, డిప్యూటేషన్లపైనే ఆధారపడి పని చేస్తోంది ఎన్టీఏ. ఇన్ హౌస్ కాపబిలిటీలను డెవలప్ చేయడం, టెస్టింగ్ లో టెక్నికల్ నిపుణులు చాలా ముఖ్యం. సెన్స్ ఆఫ్ ఓనర్ షిప్, అకౌంటబిలిటీ కూడా ముఖ్యమే. యూపీఎస్సీ స్థాయిలో ఫస్ట్ క్లాస్ అండ్ క్రెడిబుల్ టెస్టింగ్ ఏజెన్సీగా ఎన్టీఏను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఏళ్ల తరబడి టెస్టింగ్, ఎడ్యుకేషన్ లో అనుభవం ఉన్నా, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వంలో వైఫల్యం కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. స్పెషలైజ్డ్ మ్యాన్ పవర్, క్రియేటింగ్ ఇన్ స్ట్యూషనల్ మెమోరీ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్టీఏలో అవసరమైన వసతుల లోపం, పరీక్షా కేంద్రాల్లో పిల్లలకు తాగునీటి వసతులు కూడా కల్పించలేదని పరిస్థితి నెలకొంది. ఎన్టీఏ క్రెడిబిలిటీ కూడా చర్చానీయాంశంగా మారుతోంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండానే పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడం వంటి ఏకపక్ష నిర్ణయాలు ఎన్టీఏ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహించాలంటే భారీ మొత్తంలో సిబ్బంది అవసరం.