న్యూఢిల్లీ, జూలై 3: విమానం తరహాలో అధిక సంఖ్యలో 132 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీటింగ్ సదుపాయంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సు పైలట్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వెల్లడించారు. విమానంలో ఎయిర్ హోస్టెస్ ఉన్న విధంగానే ఇందులోనూ ‘బస్ హోస్టెస్’ ఉంటారని ఆయన తెలిపారు.
టాటా సంస్థతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతున్నదని, ఈ బస్సు ప్రతి 40 కిలోమీటర్లకు ఒకసారి కేవలం 40 సెకండ్లలో రీచార్జి చేసుకొంటుందని తెలిపారు. కిలోమీటర్ దూరానికి రూ.35-40 వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ కొత్త తరహా బస్సు ధర విషయంలో కూడా డీజిల్ బస్సుల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు.