Nita Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ముంబైలో మంగళవారం సామూహిక వివాహ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్ధాపక చైర్పర్సన్ నీతా అంబానీ హాజరయ్యారు.
సామూహిక వివాహాలతో ఇవాళ అనంత్, రాధిక శుభలగ్న వేడుకలు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వేదాశ్సీసులతో ఒక్కటైన నవ జంటలను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉందని, కొత్త జంటలకు తాను ఆశీస్సులు అందించానని చెప్పారు. 50 మంది నిరుపేద జంటలకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ వివాహ కార్యక్రమం నిర్వహించారు.
#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/CbHUMUZvZe
— ANI (@ANI) July 2, 2024
ఇక జులై 12న ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం అట్టహాసంగా జరగనుంది. ఈ వివాహానికి కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేపట్టారు. పెండ్లి పత్రికను ఇటీవల నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ఆర్భాటంగా నిర్వహించే ఈ పెండ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి అత్యంత ప్రముఖులు హాజరుకానున్నారు.
Read More :
Game Changer | ఇంకా ఎన్ని రోజులు.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూట్పై శంకర్ క్లారిటీ