Nirmala Sitharaman | కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో మూడోసారి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు.
2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ.
నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. తాజాగా ఆదివారం ఏర్పాటైన మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలోనూ ఆమెకు చోటు దక్కింది. మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.