కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ శాసన సభ్యులను (Trinamool New MLAs) ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్కు రావాలన్న గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సయంతిక బెనర్జీ, రేయత్ సర్కార్ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. స్పీకర్ సమక్షంలో తమతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసెంబ్లీకి గవర్నర్ రావాలని డిమాండ్ చేశారు. ‘ప్రమాణ స్వీకారానికి గవర్నర్ రాక కోసం ఎదురు చూస్తున్నాం’ అన్న ఫ్లకార్డులు, ఎన్నికల సర్టిఫికేట్లను ప్రదర్శించారు.
కాగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసన సభ్యల ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్దే అంతిమ నిర్ణయమని రాజ్భవన్ అధికారులు స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎవరైనా సభా కార్యక్రమాల్లో పాల్గొంటే తగిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సయంతిక బెనర్జీ, రేయత్ సర్కార్ సభా కార్యక్రమాలలో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.
#Kolkata: Why #TMC #MLA Sayantika Banerjee, actor-turned-politician refused to take #oath at #RajBhavan 🔗 https://t.co/6tqItSHvh9 pic.twitter.com/D0pyQ8tr02
— Economic Times (@EconomicTimes) June 27, 2024