కాఠ్మాండూ, జూలై 2: నేపాల్ రాజకీయాలు నాటకీయ మలుపు తీసుకున్నాయి. ప్రధాని ప్రచండ తీరుపై అసంతృప్తితో ఉన్న సీపీఎన్-యూఎంల్ చై ర్మన్ కేపీ శర్మ ఓలీ.. నేపాలీ కాంగ్రెస్తో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సోమవారం రాత్రి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రొటేషన్ పద్ధతిలో ప్రధాని పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. మరోవైపు తా ను ప్రధాని పదవికి రాజీనామా చేయనని.. ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని ప్రచండ తెలిపారు.