NEET | ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 (NEET – UG 2024) పరీక్ష దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో విపక్ష కూటమి నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే, తాజాగా ఈ నీట్ వ్యవహారం పార్లమెంట్కు చేరింది.
ఇవాళ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా, కేంద్ర మంత్రులు, ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యశాఖ మంత్రి (Education Minister) ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. ‘నీట్.. నీట్.. నీట్..’ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
NEET… NEET… NEET…
Opposition’s voice while the Education Minister was called for take oath! pic.twitter.com/JRgH87lYaf
— Mannu (@mannu_meha) June 24, 2024
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో సమయాన్ని కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు మొదట ఎన్టీఏ గ్రేస్ మార్కులను కలిపిన సంగతి తెలిసిందే. ఇది వివాదాస్పదం కావడంతో గ్రేస్ మార్కులు తొలగించి, వీరికి మళ్లీ పరీక్షను నిర్వహించింది. గ్రేస్ మార్కులు తొలగించిన 1,563 విద్యార్థులకు ఆదివారం నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ మరోసారి నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 1,563 మందికిగానూ 813 మంది, అంటే 52 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు ఎన్టీఏ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా, ఈ పరీక్షకు హాజరైన వారికి ఇందులో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని, హాజరుకాని వారికి గత పరీక్ష మార్కులను(గ్రేస్ మార్కులు మినహాయించిన తర్వాత) పరిగణిస్తామని గతంలోనే ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది.
Also Read..
Snapchat | తండ్రి స్నాప్చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
Rahul Gandhi | రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్.. 99కి తగ్గిన కాంగ్రెస్ బలం