NEET exam : నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నది. నీట్ పరీక్షను పెన్, పేపర్ పద్ధతిలో ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహణకుగల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కేంద్రం ఆన్లైన్ నీట్ నిర్వహణ కోసం చేస్తున్న యోచన గురించి ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం నీట్ పరీక్ష పెన్, పేపర్ విధానంలో జరుగుతున్నది. ఈ విధానంలో అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లో తమ సమాధానాలను మార్క్ చేయాల్సి ఉంటుంది. అయితే నీట్లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై ఆన్లైన్ విధానమే సరైనదని కేంద్రం యోచిస్తోందని, దీనిపై చర్చించేందుకు కేంద్రం గత వారం కనీసం మూడు ఉన్నతస్థాయి సమావేశాలను ఏర్పాటు చేసిందని ఆ మీడియా కథనం పేర్కొంది.