కోటా: ప్రవేశ పరీక్షల ఒత్తిడి మరో విద్యార్థి ఉసురు తీసింది. నీట్కు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి రాజస్థాన్లోని కోటాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవేశ, పోటీ పరీక్షల హబ్గా పేరొందిన కోటాలో ఈ ఏడాది ఇది 12వ ఆత్మహత్య. బీహార్కు చెందిన 17 ఏండ్ల హృషిత్ కుమార్ అనే 12వ తరగతి విద్యార్థి వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు ఇక్కడ ఒక వసతి గృహంలో ఉంటూ సిద్ధమవుతున్నాడు. రూములో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోటేమీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
లోక్సభ ఉప సభాపతి పదవి ఎన్డీయేకే!
న్యూఢిల్లీ: లోక్సభ ఉప సభాపతి పదవిని ఎన్డీయే ఎంపీతోనే భర్తీ చేయబోతున్నారు. బీజేపీ సర్కారు సంప్రదాయానికి భిన్నంగా ఈ పదవిని తమ కూటమి నేతకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2019-2024 మధ్య కాలంలో ఈ పదవిని భర్తీ చేయలేదు. ప్రభు త్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత వేడెక్కనున్న నేపథ్యంలో, ఈసారి కొంత సమయం తర్వాత భర్తీ చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ దృష్టి పెట్టినప్పటికీ, బీజేపీ అందుకు ససేమిరా అంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలను సంతృప్తి పరచడంపై బీజేపీ దృష్టి సారించే అవకాశం ఉంది.
వందేభారత్ స్పీడ్ తగ్గింపు
న్యూఢిల్లీ: భారత్లో సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్ల వేగాన్ని తగ్గించారు. ఆటోమేటిక్ రైల్వే రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు వీటి వేగాన్ని 160 నుంచి 130 కేఎంపీహెచ్కు తగ్గిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సరైన ట్రాకింగ్ వ్యవస్థ హజ్రత్ నిజాముద్దీన్-ఆగ్రా రైలు మార్గంలో మాత్రమే ఉండటంతో వందేభారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కడ మాత్రమే 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయి. రైలు ప్రమాదాలు జరగకుండా రక్షణ కల్పించే కవచ్ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వచ్చేవరకు వీటి వేగాన్ని 130 కి.మీకు తగ్గించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.