NDA | ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం (NDA Parliamentary party meeting) ఢిల్లీలో ప్రారంభమైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ ఇవాళ తొలిసారి సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మిత్రపక్ష ఎంపీలతో మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం నేపథ్యంలో హాల్లోకి వచ్చిన మోదీకి ఎంపీలంతా ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలి పార్లమెంటరీ సమావేశం కావడంతో ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. దేశసేవ ప్రథమ కర్తవ్యమని ఎంపీలందరికీ మోదీ సూచించారు.
#WATCH | PM Modi welcomed by NDA leaders at the NDA Parliamentary Party meeting in Delhi pic.twitter.com/dRZnJ7yHzv
— ANI (@ANI) July 2, 2024
కాగా, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ సారి ఇతరులపై ఆధారపడిన విషయం తెలిసిందే. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేక పోయింది. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియా కూటమి పార్టీలకు 230కి పైగా సీట్లు రావడం మోదీ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లైంది. ఇక చేసేదేమీ లేక కూటమి నేతల మద్దతుతోనే మోదీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టారు.
Also Read..
Game Changer | ఇంకా ఎన్ని రోజులు.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూట్పై శంకర్ క్లారిటీ
Turbulence | స్పానిష్ విమానంలో భారీ కుదుపులు.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Motilal Nayak | మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?.. దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్