ముంబై: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడినందుకు రూ.137 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఎన్సీపీ ఎమ్మెల్సీ ఏక్నాథ్ ఖడ్సే, ఆయన కోడలు, బీజేపీ ఎంపీ రక్షా ఖడ్సేలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
తవ్వకాలకు పాల్పడిన భూమి ఏక్నాథ్ ఖడ్సే కుటుంబానికి చెందినప్పటికీ భారీస్థాయిలో మొరం, బ్లాక్ స్టోన్లను వెలికితీశారని, దీని కోసం అవసరమైన అదనపు అనుమతిని తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. 15 రోజుల్లోగా జరిమానాను చెల్లించాలని నోటీసులో తెలిపారు. కాగా దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీలో కొనసాగిన ఏక్నాథ్ ఖడ్సే 2020లో ఎన్సీపీలో చేరారు. దీంతో ఆయనపై కక్ష్యపూరిత చర్యలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి.