Mukesh Ambani : పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని గురువారం ఆమె నివాసంలో కలిశారు. తన కుమారుడు అనంత్ అంబానీ పెండ్లి పత్రికను ఈ సందర్భంగా సోనియాకు అందచేసిన ముఖేష్ అంబానీ ఆమెను వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
టెన్ జన్ఫథ్లో సోనియా గాంధీతో ముఖేష్ అంబానీ సమావేశమయ్యారు. ఇక జులై 12న ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం అట్టహాసంగా జరగనుంది. ఈ వివాహానికి కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేపట్టారు.
పెండ్లి పత్రికను ఇటీవల నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ఆర్భాటంగా నిర్వహించే ఈ పెండ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Read More :