న్యూఢిల్లీ: నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసులో మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ అనే వ్యక్తులను పట్నాలో సీబీఐ అరెస్టు చేసింది. పరీక్షకు ముందు కొంతమంది అభ్యర్థులకు వీరు పట్నాలోని లెర్న్ బాయ్స్ హాస్టల్లో వసతి కల్పించారని, అక్కడ వారికి లీక్ చేసిన పరీక్ష పత్రాల్ని, వాటి జవాబులను అందజేశారని సీబీఐ తెలిపింది.
నీట్లో అక్రమాలకు నిరసనగా ఢిల్లీలోని జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) వద్ద గురువారం ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు.
నీట్ అభ్యర్థులకు అందించిన ఓఎంఆర్ షీట్లకు సంబంధించి ఫిర్యాదులను లేవనెత్తడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అన్నది తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్టీఏను ఆదేశించింది. ఈమేరకు నోటీసులు జారీచేసింది. అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లు రాలేదని పిటిషన్దారులు పేర్కొన్నారు. మరోవైపు, సిలబస్లో లేని పాఠ్యాంశాల నుంచి నీట్లో ప్రశ్నలు ఇచ్చారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై రెండు వారాల్లోగా స్పందించాల్సిందిగా ఎన్టీఏ, జాతీయ మెడికల్ కమిషన్ను కోర్టు ఆదేశించింది.