చెన్నై: మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ సంఘటనే నిదర్శనం. రోడ్డు పక్కగా రెండు ఆవులు పోట్లాడుకున్నాయి. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఒక ఆవు ఢీకొట్టింది. (man knocked by cow) ఎగిరి రోడ్డుపై పడిన అతడి మీదుగా బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడమే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ సంఘటన జరిగింది. మేజిస్ట్రేట్ కోర్టులో పనిచేసే 58 ఏళ్ల వేలాయుధరాజ్ శనివారం ఉదయం బైక్పై విధులకు బయలుదేరాడు.
కాగా, ఒక ప్రాంతంలో రోడ్డు పక్కగా రెండు ఆవులు కోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వేలాయుధరాజ్ను ఒక ఆవు కుమ్మేసింది. దీంతో అతడు ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇంతలో వేగంగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న అతడి వద్దకు బస్సు డ్రైవర్, స్థానికులు పరుగెత్తారు. వేలాయుధరాజ్ మరణానికి కారణమైన ఆవు అనంతరం రోడ్డు దాటి వెళ్లింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. వేలాయుధరాజ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
As a two-wheeler rider, who was hit by the fighting stray cattle, fell under a TNSTC bus and died on the spot on Saturday, the Tirunelveli corporation officials initiated a special drive to impound the stray cattle across the corporation limit on Sunday. pic.twitter.com/E5cyhXGbPV
— Thinakaran Rajamani (@thinak_) June 23, 2024