Sharad Pawar | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని శరద్ చంద్ర పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్లో జరుగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో భాగమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న మిత్రపక్షాల ప్రయోజనాలను పరిరక్షించడం మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల అనైతిక బాధ్యత అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, శరద్ చంద్రపవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివసనే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిలో కూటమిలో భాగం కాగా.. థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయే ముందు వరకు అంటే.. నవంబర్ 2019 నుంచి జూన్ 2022 వరకు మహా వికాస్ అఘాడి కూటమి అధికారంలో ఉన్నది. మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటాయని పవార్ అన్నారు.
రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దాన్ని నెరవేర్చాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్ష కూటమిదేననన్నారు. మహాభారతంలో అర్జునుడు చేపకన్నును లక్ష్యంగా గురి చూసి కొట్టిన విధంగా.. తమ కళ్లన్నీ మహారాష్ట్ర ఎన్నికలపైనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ (SP), శివసేన (UBT) కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న ఆయన.. రాష్ట్రంలో సీట్ల పంపకాలపై ఇంకా చర్చలు ప్రారంభం కాలేదన్నారు. ఈ విషయంలో త్వరలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీల ప్రయోజనాలను కాపాడడం మన నైతిక బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘మీరు ఖాళీ జేబులతో మార్కెట్కు వెళ్తే ఏం జరుగుతుంది’ అంటూ ప్రశ్నించారు. బడ్జెట్లో ప్రభుత్వం 21 నుంచి 60 సంవత్సరాల మహిళలకు రూ.1500 భృతి, ప్రతి కుటుంబానికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, రైతు అనుకూల చర్యలు, నైపుణ్య శిక్షణ కోసం యువతకు రూ.10వేలు చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు.