Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) గెలుపొందిన టీమ్ ఇండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా (Om Birla), ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్ రోహిత్శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్కోహ్లీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా టీమ్ఇండియా జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Lok Sabha Speaker Om Birla and the House congratulates Cricket Skipper Rohit Sharma and the entire Team India on winning #T20WorldCup2024 pic.twitter.com/MOI144KSxh
— ANI (@ANI) July 1, 2024
17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది.
Also Read..
Barbados | హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్లోనే టీమ్ఇండియా
Shatrughan Sinha | తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్న సిన్హా
LPG cylinder | మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..?