Lok Sabha : లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమవగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఓం బిర్లాను తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.
ఆ తర్వాత అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ.. సభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. చివరగా స్పీకర్ మాట్లాడుతూ.. లోక్సభ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఖండిస్తున్నదని ప్రకటించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను అభినందిస్తున్నదని చెప్పారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.