న్యూఢిల్లీ: లోక్సభ(Loksabha)లో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చి వాయిదా తీర్మానంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరు వైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల అన్నారు. నీట్పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
#WATCH | Lok Sabha adjourned til 12 noon. LoP Rahul Gandhi raised NEET issue and demanded, along wth Opposition MPs, that the matter be discussed. Speaker Om Birla insisted that discussion on Motion of Thanks to President’s Address be taken up first.
LoP says, “…We wanted to… pic.twitter.com/p63AOqGOuN
— ANI (@ANI) June 28, 2024
స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని తెలిపారు. కానీ మరో వైపు విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టువీడలేదు. నీట్పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా నీట్ అంశంపై రచ్చ జరుగుతోంది. పేపర్ లీకేజీపై ఖర్గే ఆరోపణలను చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మెన్ జగదీప్ ధన్కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
Rajya Sabha adjourned till 12 noon. Rajya Sabha LoP Mallikarjun Kharge raised the NEET issue along with Opposition MPs, that the matter be discussed. pic.twitter.com/6qyxbR4SJY
— ANI (@ANI) June 28, 2024