NEET Issue : నీట్ వివాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్ధుల భవిష్యత్తో చెలగాటమాడిన నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిందని, ఈ చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నీట్ వివాదంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా తెలిపారని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ను నిరోధించేందుకు కఠిన చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. నీట్ వ్యవహారంపై ప్రధాని ఇప్పటికే భరోసా ఇచ్చారని, కఠిన చట్టాన్ని ఆమోదించడం జరిగిందని గుర్తుచేశారు.
విపక్షాలు మోదీని ఉదయం నుంచి రాత్రి వరకూ నిందిస్తుంటాయని, మళ్లీ భావ ప్రకటన స్వేచ్ఛ లేదని అంటుంటారని మండిపడ్డారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ సభలో కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టించిందని మంత్రి ఆరోపించారు. ప్రధాని ప్రసంగానికి అవాంతరాలు కల్పించడం విపక్ష ఆనవాయితీగా మారిందని దుయ్యబట్టారు.
Read More :
Rahul Gandhi | నిఘావర్గాల హెచ్చరికలతో.. ప్రతిపక్షనేత రాహుల్ నివాసం వద్ద భద్రత పెంపు..!