CPM-ED | కేరళలో అధికార సీపీఐ (ఎం)కు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. కరువాన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో హవాలా లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎం) భూమి, బ్యాంకు డిపాజిట్లు జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి. కానీ తాము హవాలా లావాదేవీలకు పాల్పడలేదని, తప్పు చేయలేదని సీపీఐ (ఎం) వాదిస్తోంది. సీపీఐ (ఎం) ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.
త్రిసూర్ జిల్లాలో రూ.10 లక్షల విలువైన భూమి, సీపీఎంకు చెందిన ఐదు గుర్తు తెలియని రూ.63 లక్షల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను సీపీఐ (ఎం) తిరస్కరించింది. కరువన్నూర్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ దర్యాప్తు విషయమై రాజకీయంగా పోరాడతామని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. రాజకీయ కారణాల రీత్యా విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం ఈడీకి అలవాటుగా మారిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమకు వ్యతిరేకంగా సాక్షాధారాలు సేకరించడంలో విఫలమైందన్నారు.
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!