తిరువనంతపురం: కేరళ రాష్ట్ర పేరును కేరళం(Keralam)గా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు అందరూ ఏకపక్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు.
గత ఏడాది ఆగస్టులో కూడా ఇదే తరహా తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరారు. అయితే ఆ తీర్మానంపై కొన్ని సాంకేతికపరమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ కొత్త తీర్మానాన్ని పాస్ చేశారు.