Hooch Tragedy : తమిళనాడు (Tamil Nadu)లోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కల్తీసారా ఘటనలో శుక్రవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరిందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి తెలిపారు.
ఇక ఈ ఘటనపై విచారణకు జస్టిస్ గోకుల్దాస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. కళ్లకురిచి ఆస్పత్రిని సందర్శించిన జస్టిస్ గోకుల్దాస్ బాధితులను పరామర్శించారు. తాను ఇప్పుడే కళ్లకురిచి ఆస్పత్రిని విజిట్ చేసి దర్యాప్తును ప్రారంభించానని చెప్పారు.
కొద్దిమంది రోగులతో తాను మాట్లాడానని, విచారణ పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి అందచేస్తానని తెలిపారు. విచారణ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చిందని, తాను గడువులోగా విచారణ చేపట్టి నివేదికను సమర్పిస్తానని జస్టిస్ గోకుల్దాస్ వివరించారు.
Read More :
RTC Bus | ఆర్టీసీ బస్సులో మహిళా సైకో వీరంగం.. కత్తి చూపిస్తూ హల్చల్